జీర్ణాశయంలో అవసరానికి మించి ఆమ్లాలు ఉత్పత్తి అవడం వళ్ళ కడుపులో మంట ఏర్పడుతుంది. దీనిని అసిడిటీ అంటారు. అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు పెద్ద వ్యాధులు కాదు. కానీ వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల చాల పెద్ద సమస్యలుగా మారి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అరికట్టవచ్చు. ముందుగా అసిడిటీ రావడానికి గల కారణాలు తెలుసుకుందాం.
అసిడిటీ రావడానికి గల కారణాలు:
- ఆహారంపైన అదుపులేకపోవడం.
- సరైన ఆహార వేళలు పాటించకపోవడం.
- మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేకపోవడం.
- ధూమపానం, మద్యపానం, పాన్, గుట్కా లాంటి అలవాట్లు.
- ఎక్కువగా పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ వాడకం.
- ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్, ఎక్కువగా పుల్లగా ఉన్న పదార్థాలు, మసాలా పదార్థాలు తినడం.
అసిడిటీ లక్షణాలు:
కడుపులో మంట, వికారం, వాంతులు ఉంటాయి. వీరిలో అజీర్ణం, మలబద్దకం పెరిగి ఆకలి మందగిస్తుంది. కొందరు తింటే కడుపులో మంట, కొందరికి తినకపోతే మంట.
అసిడిటీ కి ఆలోపతి మెడిసిన్ ప్రభావం:
అసిడిటీకి మందులు కొద్దిరోజులు వాడటం వల్ల ఫలితం బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు ఈ మందులు వాడటం వల్ల “బోన్ మినరల్ డెన్సిటీ” వస్తుంది. ఈ మందులు వాడకం వళ్ళ శరీరం ఐరన్, క్యాల్షియం గ్రహించలేకపోతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. దీని వల్ల వీరిలో ఫ్రాక్చర్స్ అవడం, కిడ్నీలలో రాళ్ళూ రావడం, పూర్తిగా కిడ్నీలు చెడిపోవడం లాంటివి జరుగుతుంటాయి.
అసిడిటీనీ తగ్గించే ఆహార మార్గాలు:
- 1స్పూన్ నెయ్యిని 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- చల్లటి పాలు తాగడం వల్ల పొట్టలో ఆసిడ్స్ ఎక్కువసేపు ఆసిడ్స్ ఉత్పత్తి కాకుండా చేస్తుంది.
- తియ్యటి మజ్జిగ తీసుకోవడం వల్ల వెంటనే ఫలితం కనిపిస్తుంది. దీనిలోని లాక్టిక్ ఆసిడ్ పొట్టలోని అసిడిటినీ మల్లి సాధారణ స్థితికి తీసుకువస్తుంది.
- కొబ్బరి నీళ్లకి ఈ ఆసిడ్స్ ప్రభావం నుండి పొట్టని రక్షించే శక్తి ఉంది. అందుకే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- 5,6 తులసి ఆకుల్ని తీసుకుని నీళ్లలో మరిగించి చల్లార్చి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తరుచు తీసుకోవడం వల్ల ఎసిడిటీ దాదాపుగా తగ్గుతుంది. ఇది ఉత్తమమైన మార్గం.